మురడి పాఠశాలలో 'పాల్ ల్యాబ్' ప్రారంభం
ATP: మురడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'పాల్ ల్యాబ్'ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. తరగతి గది బోధనతో పోలిస్తే, ల్యాబ్ ద్వారా బోధన అందించినప్పుడు విద్యార్థుల్లో అవగాహనశక్తి 2.25% పెరుగుతుందని ఆయన తెలిపారు. వెనుకబడిన, తెలివైన విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన బోధన అందుబాటులో ఉంటుందని చెప్పారు.