పంచలింగాల పర్యటనలో ఎంపీ
KRNL: కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటించి అభివృద్ధి పనులను ఇవాళ పరిశీలించారు. ఎంపీ నిధులు, NREGS ద్వారా జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. గ్రామ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇస్తూ, కొత్త పశు వైద్యశాల నిర్మాణం చేపడతామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.