గ్రామంలో బడిబాట కార్యక్రమం

గ్రామంలో బడిబాట కార్యక్రమం

JGL: ధర్మపురి మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలను కలిసి, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని హెచ్ఎం బట్టురి రాజేశం కోరారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈనెల 6 నుంచి 19వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.