నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఓపెన్

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం రాత్రి 76 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 TMC కాగా, 15.667 TMC లకు చేరుకుంది. గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది.