'ధురంధర్-2'.. 48 గంటల్లో 312M వ్యూస్
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ధురంధర్-2'. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. యూట్యూబ్లో ఈ మూవీ ట్రైలర్కు రికార్డు స్థాయిలో 48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇటీవల ఒక మూవీ ట్రైలర్కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.