ప్రజల కష్టాలు తీర్చడమే పోలీసుల అసలైన ఆనందం: ఎస్పీ
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన PGRSలో ఎస్పీ ధీరజ్ ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల అసలైన సంతృప్తి అని పేర్కొంటూ, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఇచ్చే ఫిర్యాదులను కూడా సమానంగా పరిగణించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.