పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

HYD: నగరంలో పెంపుడు పిల్లుల విషయంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. పిల్లిని ఇంట్లోకి తీసుకురావొద్దని తల్లి వాదించినందుకు అల్వాల్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ఠ ఆత్మహత్యకు పాల్పడింది. మరో ఘటనలో.. మీర్పేట్‌కు చెందిన బీఎస్సీ విద్యార్థిని హిమబిందు తన పెంపుడు పిల్లి చనిపోయిందన్న బాధతో ప్రాణాలు తీసుకుంది.