ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

NLG: జిల్లా కేంద్రంలోని శ్రీహాన్‌ ఆసుపత్రిలో శనివారం ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన షేక్‌ షబానాకు మూడేండ్ల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని శ్రీహాన్‌ ఆసుపత్రిలో చేరింది.