ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే.!
HYD: నగరంలోని ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలపై మాదాపూర్ పోలీసులు జరిపిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. సైబర్ టవర్స్ వద్ద గంట వ్యవధిలోనే 10,138 మంది సింగిల్ రైడర్స్ ప్రయాణించినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు కేవలం 3,584 మంది మాత్రమే ఉన్నారు. ఇలా భారీగా సింగిల్ రైడర్లు పెరగడం వల్లే రహదారులు నిండిపోయి, తీవ్ర ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి.