దారుణం.. ఎండలో బిడ్డను వదిలేసిన కసాయి తల్లి
KMR: అప్పుడే పుట్టిన నవజాత బాలుడిని ఎండలో వదిలేసిన ఘటన బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. మదీనా గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును మదీనా కాలనీలో వదిలివెళ్లారని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకుని శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.