చేనేత జౌళి శాఖ కమిషనర్ను కలిసిన పద్మశాలి సంఘం కార్యవర్గం
SRCL: హైదరాబాద్ చేనేత భవన్లో చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యను నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శైలజా రామయ్యని శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో దూడం శంకర్, మండల సత్యం, డా. గాజుల బాలయ్య, మోర రవి, కోడం శ్రీనివాస్, యెల్లె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.