మనీ లాండరింగ్ కేసు.. భారత బిలియనీర్కు జైలు శిక్ష

మనీ లాండరింగ్ కేసులో భారత బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీకి దుబాయ్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అబు సబాహ్’గా పేరొందిన ఈ వ్యాపారవేత్త నుంచి రూ.344 కోట్లు జప్తు చేయాలని ఆదేశించింది. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్లతో ఆయన మోసానికి పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.