సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను పరిశీలించిన కిషన్ రెడ్డి
HYD: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులను పరశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 715 కోట్ల బడ్జెట్తో తొలిదశ పనులు జరుగుతున్నాయన్నారు. నాలుగు నెలల్లో సౌత్ బ్లాక్ పూర్తి అవుతుందని, దశలవారీగా రైల్వేస్టేషన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వచ్చే డిసెంబర్లోగా మొత్తం రైల్వేస్టేషన్ సిద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు.