ఎమ్మెల్యే ఆధ్వర్యంలో డా.బీఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
KMR: నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట్లో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో డా.బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి దిశానిర్దేశం చేశాయన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.