అగ్నిప్రమాదంలో 15 ఎకరాల గడ్డివాము దగ్ధం

అగ్నిప్రమాదంలో 15 ఎకరాల గడ్డివాము దగ్ధం

BPT: కర్లపాలెం మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద గొల్లపాలెం గ్రామానికి చెందిన రైతు నర్రా కృష్ణమూర్తికి చెందిన గడ్డివామి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. ప్రమాదంలో సుమారు 15 ఎకరాల గడ్డివాము కాలి బూడిదైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో సదరు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.