VIDEO: జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
KMM: జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు, రైతు సంఘం నేతలు ఇవాళ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. రైతులు పండించిన వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు, ఏఐకేఎంఎస్ నాయకులు కలెక్టరేట్లోనికి చొచ్చుకొని వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.