మధ్యవర్తిత్వం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన

ELR: జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి అవగాహన కలిగించారు. ఈమేరకు కక్షిదారులకు మధ్యవర్తిత్వం వల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. అలాగే రేపు ఉదయం 9.00 గంటలకు జిల్లా కోర్ట్ ప్రాంగణము నుండి 'వన్- కే' వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు.