'ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి'
MNCL: జైపూర్ మండలం నర్వ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతుండగా తరగతి గదిలో బెంచీలు లేక కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు స్పందించి బెంచీలు ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికందర్ కోరారు.