కలెక్టరేట్ PGRSలో 232 అర్జీలు స్వీకరణ

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం ఇంఛార్జ్ డీఆర్వో సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీవో సువర్ణ, డీపీవో సమత ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా మొత్తం 232 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. పెనుకొండ 70, ధర్మవరం 45, కదిరి 46 అర్జీలు అందగా.. ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.