పెనుమంట్రలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

పెనుమంట్రలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

E.G: పెనుమంట్రలో ఇవాళ ANM భాగ్య కుమారి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రత  ప్రాముఖ్యతను వివరించారు. ఇళ్ల వద్ద చెత్త, పాత వస్తువులు పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది, విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.