మండలంలో పంట నష్టపోయిన వారికి పరిహారం

మండలంలో పంట నష్టపోయిన వారికి పరిహారం

CTR: ఏనుగు దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, డీఎఫ్‌వో సుబ్బరాజుతో కలిసి పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మంగళవారం గుడిపాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 30 మంది రైతులకు రూ.2.76 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.