విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 4.21 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 4.21 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 4.21 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 606 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 24 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 3620 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.