'అబద్ధాలు ఆడటం జగన్కు అలవాటుగా మారింది'
AP: మాజీ సీఎం జగన్పై మంత్రి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. పదేపదే అబద్ధాలు ఆడటం జగన్కు అలవాటుగా మారిందని అన్నారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసి మమ్మల్ని విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యతో సంబంధం లేదని జగన్ అంగీకరించగలరా? అని నిలదీశారు. తల్లి, చెల్లిని ఇంట్లోంచి గెంటేసింది మీరు కాదా? అని విమర్శించారు.