తాగునీటి వివాదంలో ఘర్షణ.. కేసు నమోదు

తాగునీటి వివాదంలో ఘర్షణ.. కేసు నమోదు

NLR: విడవలూరు మండలం రామతీర్థంలో లే అవుట్‌కు పంచాయతీ తాగునీటి తరలింపునకు పైపులైను ఏర్పాటుపై వివాదం చోటు చేసుకుంది. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా అధికారుల సమక్షంలో లే అవుట్ యజమాని నరేంద్ర, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు నరేంద్ర తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.