ఎన్వీ బంజర సర్పంచ్గా జర్పుల సౌందర్య
KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజర గ్రామంలో సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జర్పుల సౌందర్య విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్లో సమీప అభ్యర్థిపై 129ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.