ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ను కలిసిన జిల్లా నాయకులు
NRML: ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ను శుక్రవారం ముదిరాజ్ నాయకులు కలిసి భీమన్న గుట్ట అన్యాక్రాంతం అవుతున్న నేపథ్యంలో భూమిని రక్షించాలని కోరారు. ఈ మేరకు ముదిరాజ్ కులస్తులకు అప్పగించాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి సహాయం చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ ముదిరాజ్, సాయన్న, దేవేందర్లు పాల్గొన్నారు.