సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

జమ్మూకశ్మీర్, ఛండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధం వచ్చినప్పుడు, ఘర్షణల టైంలో వేగంగా ప్రతిస్పందించడం, తమను తాము రక్షించుకోవడం, బాంబు పేలుడు జరిగినప్పుడు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ అవుట్ చేపట్టారు.