VIDEO: ఎరువుల కోసం రైతుల క్యూ లైన్

MDK: చేగుంట మండలంలో ఎరువుల కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేగుంట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 500 బస్తాల యూరియా ఎరువు రావడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆగ్రోస్ కేంద్రం వద్ద వర్షంలో రైతులు క్యూలైన్ కట్టి ఎరువులు పొందారు. ఎకరా రైతుకు ఒక బస్తా, రెండు ఎకరాల రైతుకు రెండు బస్తాల యూరియా పంపిణీ చేశారు.