యూరియా లేక ఇబ్బందులు పడుతున్నాం: రైతన్నలు

సిరిసిల్ల: యూరియా కోసం రైతన్నలు రాస్తారోకో చేపట్టారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో మంగళవారం రైతులు యూరియా కోసం రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం తమకు 100 టన్నుల యూరియా అవసరమంటుందని, ఇప్పటివరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని రైతులు ముత్యాల కిషన్ రెడ్డి, జవ్వాజి రాజు గౌడ్లు ఆవేదన వ్యక్తం చేశారు.