ఆకట్టుకున్న మార్కెటింగ్ కార్యక్రమం
NRPT: మరికల్ మండల కేంద్రంలోని రెయిన్ బో ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం నిర్వహించిన మార్కెట్ డే కార్యక్రమం ఆకట్టుకుంది. రైతుల కష్టాలను స్వయంగా అధ్యయనం చేసేందుకు మార్కెట్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ షాఫి, ప్రిన్సిపల్ అస్మా తెలిపారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేమోన్ రెడ్డి, సర్పంచ్ చెన్నయ్యలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.