పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీడీవో
కోనసీమ: కాట్రేనికోన మండలం పెనుమళ్ల పంచాయితీ కార్యాలయాన్ని ఎంపీడీవో రాజేశ్వర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పౌర సేవలు వేగంగా అందించాలని సూచించారు. సేవలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.