VIDEO: మరదలిపై వదిన కత్తితో దాడి..!

NRML: మరదలిపై వదిన కత్తితో దాడికి పాల్పడిన ఘటన బుధవారం ముధోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్లో అద్దెకు ఉంటున్న SBI ఉద్యోగి హనుమంత్ రావు భార్య అశ్విని... ఆయన చెల్లిపై బుర్కా వేసుకుని వచ్చి కత్తితో దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితురాలిని హుటాహుటిన భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.