విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 2.48 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 2.48 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,48,367 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 203 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 11 మంది దంపతులు శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1920 మంది అన్న ప్రసాదం స్వీకరించారని పేర్కొన్నారు.