తాగునీటి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

తాగునీటి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిధుల మంజూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రూ.90 కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా 50 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.