రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి
RR: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు గంజి అశోక్ (55) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన సుజుకి యాక్సెస్ వాహనంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో అశోక్ అక్కడిక్కడే మృతి చెందాడు. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.