అర్హులకు అన్యాయం జరగనివ్వం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

E.G: రాజమండ్రి 13, 14 డివిజన్లలో బుధవారం నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమం విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందజేసి, స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.