విద్యుత్ షాక్తో ఆవు మృతి

KDP: మండలంలోని చల్లగిరిగేల దళితవాడ సమీపంలో శుక్రవారం విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందింది. మారిపోగు పిచ్చయ్యకు చెందిన ఆవు గ్రామ సమీపంలో పశుగ్రాసం మేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండే తీగలను ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవు మృతి చెందడం పట్ల బాధితుడు ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.