జరుగుమల్లిలో పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

ప్రకాశం: జరుగుమల్లి మండలంలోని కామేపల్లిలో ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, తల్లికి నిమ్మకాయ దండలు, కుంకుమ పూజ, గోత్ర నామార్చనలు, వాహన పూజలు నిర్వహించారు.