రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ATP: రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లు జతచేయనున్నారు. బెంగళూరు నుంచి డిసెంబరు 1 నుంచి జనవరి 15 వరకు (నం.16593)కు ఒక ఏసీ త్రీటైర్, స్లీపర్, జనరల్ కోచ్‌ను జతచేస్తారు. తిరుగు ప్రయాణపు రైలు (నం.16594)కు డిసెంబరు 3 నుంచి జనవరి 17 వరకు ఈ అదనపు కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.