కర్నూలులో అత్యధికంగా 44.2 డిగ్రీల నమోదు
KRNL: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కర్నూలు జిల్లా లద్దగిరి, అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.