రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంది: ఏకుల
అన్నమయ్య: రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి అన్నారు. రాజంపేట పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం వైసీపీకి చెందిన మహిళలు నిరసనలు చేపట్టారు. 100 రూపాయలకే మద్యం ఇస్తామని ఎన్నికల్లో చెత్త హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇది అన్నారు.కల్తీ మద్యంతో ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.