రాయలసీమకు జగన్ ద్రోహం చేశారు: మంత్రి
AP: ఐదేళ్ల పాలనలో రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతంపై మాట్లాడదామంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదని అన్నారు. జగన్ ఎన్ని అబద్దాలు చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. కరపత్రికను అడ్డుకుపెట్టుకుని రాజధానిపై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.