ఫేక్ న్యూస్పై కేంద్రం హెచ్చరిక
'ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం' పేరిట జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని 'పీఐబీ ఫ్యాక్ట్చెక్' స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకమేదీ తీసుకురాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, సైబర్ మోసాలలో చిక్కుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని సూచించింది.