ఉమ్మడి జిల్లాలో కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
CTR: ఉమ్మడి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కురబలకోట(M) ముదివేడు జాతరకు వచ్చిన ఇద్దరు కరెంట్ షాక్తో మృతి చెందారు. ఓ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ముదివేడు రెడ్డివారిపల్లిలో ఉంటున్న సునీత, జగదీశ్ దంపతుల ఇంటికి జాతరకు వచ్చిన పుంగనూరు(M)చెందిన శంకర్ రెడ్డి భార్య పద్మావతి(50), చిత్తూరుకు చెందిన వెంకటేష్ మృతి చెందారు.