ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ ఘాట్రోడ్డులో ఆటో బోల్తా పడింది. ప్రకాశం జిల్లా దేవరకొండకు చెందిన 15 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మొదటి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీరిలో సుహాసిని, సాన్వికలకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.