కశింమిట్ట సర్పంచ్కి MLA పరామర్శ

TPT: నారాయణవనం మండలం కశింమిట్ట గ్రామ పంచాయితీ సర్పంచ్ బుడత అయ్యప్ప శశికళ తల్లి బి.సుశీలమ్మ (60) సోమవారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుమారుడు అయ్యప్పను ఫోన్లో పరామర్శించారు. అనంతరం చిత్తూరు జిల్లా ఉమ్మడి జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోనేటి సుమన్ కుమార్ పరామర్శించారు.