VIDEO: డీజిల్ కొరతతో నిలిచిన 500 బోట్లు
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. గత ఐదు రోజులుగా సరఫరా నిలిచిపోవడంతో సుమారు 500కు పైగా బోట్లు హార్బర్కే పరిమితమయ్యాయి. ప్రభుత్వం డీజిల్ సరఫరా చేయకపోవడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధరలను తగ్గించి, సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.