9న సర్వసభ్య సమావేశం
VZM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 9న (గురువారం) ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరగనుంది. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.