ఎస్సైకి మద్దతుగా రైతుల ధర్నా
ATP: పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులుకు మద్దతుగా రైతులు, గ్రామస్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ అదుపులోకి తీసుకొని కొట్టగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు రోడ్డుపైకి వచ్చి ఎస్ఐకి మద్దతుగా నిలిచారు.