కరెంటు స్తంభాన్ని ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
WG: కాళ్ల మండలంలో బైక్ అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. SI హనుమంతు నాగరాజు వివరాలు.. కాళ్లకూరు నుంచి ఉల్లి శ్రీరాములతో కలిసి ఆకివీడు వస్తుండగా ఐ. భీమవరం వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మాసాది మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుకకూర్చున్న శ్రీరాములకు తీవ్ర గాయాలు అయ్యాయన్నారు.